
గత ఏడాది పదో తరగతి ఫలితాలలో కేవలం 67.26శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న వైసీపీ ప్రభుత్వానికి ఈ ఫలితాలు పెద్ద షాక్ అనే చెప్పాలి. కానీ కరోనా కారణంగా రెండేళ్ళుగా విద్యార్థులు చదువులలో వెనకబడిపోయారని, గుజరాత్ కంటే ఏపీకి ఒక్క శాతం ఎక్కువే వచ్చిందంటూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చక్కగా సమర్ధించుకొన్నారు.
అదే సమయంలో… మాస్ కాపీయింగ్, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కూడా బయటపడటంతో తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు మద్యలో నారాయణా విద్యాసంస్థలపై ఆరోపణలు చేస్తూ, ఆ సంస్థల అధినేత నారాయణను హైదరాబాద్ నుంచి నాటకీయంగా అరెస్ట్ చేసి పెద్ద కధ నడిపించిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ నారాయణను దోషి అని ప్రభుత్వం నిరూపించలేకపోయింది.
ఈసారి కరోనా లేదూ… అదృష్టవశాత్తు మాస్ కాపీయింగ్ జరగలేదు… ప్రశ్నాపత్రాల లీక్ అవలేదు. పైగా గత ఏడాది కంటే ఈసారి విద్యావ్యవస్థను ప్రభుత్వం మరింత ప్రక్షాళన చేసేసి సంస్కరించేసింది కనుక ఈసారి కనీసం 95% పైన లేదా నూటికి నూరు శాతం ఉత్తీర్ణత వస్తుందని ఆశిద్దాం. ఒకవేళ గత ఏడాది ఫలితాలే ఈసారి కూడా పునరావృతమైతే, ఈసారి విద్యామంత్రిగారు ఏ కొత్త కధలు చెపుతారో వినడానికి అందరూ సిద్దంగా ఉండాలి.
When Nagarjuna tweeted about Lenin, one line stood out: “Mark the date!”!!” It didn’t feel…
Mohanlal’s much-awaited Drishyam 3, directed by Jeethu Joseph, is preparing for a worldwide theatrical release…