Telugu

సిఎం గారి శ్లాబా… మజాకా… 11 గంటల్లో 10 వేల అడుగులు..!

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పరిధిలో ఇటీవలే మొదలైన తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు జెట్ స్పీడుతో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువు కంటే ముందుగానే నిర్మాణాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈ పనులను దక్కించుకున్న నిర్మాణ రంగ కంపెనీలు ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. సదరు కంపెనీలకు సీఆర్డీఏ అధికారుల మద్దతు జతకూడటంతో నిర్మాణ పనుల్లో మరింత వేగం నమోదైంది.

తాత్కాలిక సచివాలయంలో భాగంగా సీఎం కార్యాలయం సహా, ఐదు కార్యాలయాలకు ఈ నెలాఖరు నాటికి శ్లాబ్ ను పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. అయితే ఈ గడువు కంటే దాదాపు 20 రోజులు ముందుగానే సదరు పనిని కంపెనీలు పూర్తి చేయడం విశేషం. ఆధునిక యంత్రాలతో పిల్లర్లను అనుకున్న గడువు కంటే ముందుగానే కంపెనీలు ఏర్పాటు చేశాయి.

ADVERTISEMENT

మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో సీఎం కార్యాలయానికి శ్లాబ్ ను వేసే ప్రక్రియను మొదలుపెట్టిన కంపెనీలు, బుధవారం ఉదయం 9 గంటల సమయానికల్లా సదరు పనిని పూర్తి చేశాయి. అంటే… కేవలం 11 గంటల సమయంలో 10 వేల చదరపు అడుగుల మేర విస్తీర్ణం కలిగిన సీఎం కార్యాలయం శ్లాబ్ ను దిగ్విజయంగా పూర్తి చేశాయి. ఇదే వేగంతో పనులు కొనసాగితే జూన్ నాటికి తాత్కాలిక సచివాలయం ఏర్పాటు కావడం పెద్ద కష్టం కాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్, శరణ్య… బాధితులు ఎవరు?

ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…

16 minutes ago

175/175 ఓ భ్రమ… ఈసారి మనమే మరో భ్రమ?

కొన్నిసార్లు భ్రమలకు, వాస్తవాలకు తేడా కనిపిస్తున్నా భ్రమలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. భ్రమలు మాత్రం మనం…

23 minutes ago