
గతేదాడి కాలంగా టీమిండియా హెడ్ కోచ్ గా సేవలందించానని, ఈ అవకాశాన్ని ఇచ్చిన బీసీసీఐకు కృతజ్ఞతలు తెలిపాడు కుంబ్లే. కోచ్ గా తన బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో తనకు కెప్టెన్ కు మధ్య అభిప్రాయబేధాలు కలిగాయని, వీటిని పరిష్కరించేందుకు బీసీసీఐ సభ్యులు కూడా రంగంలోకి దిగారని, అయినప్పటికీ ఫలితం లేదని, దీంతో తన బాధ్యతల నుండి తప్పుకోవడమే టీమిండియాకు సముచితమైన నిర్ణయంగా భావించి తన హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నానని, ఎప్పటికీ ఇండియా శ్రేయోభిలాషినేనని భావోద్వేగంతో తెలిపారు.
కుంబ్లే వ్యవహారశైలి, నిబద్ధత, చిత్తశుద్ధి తెలిసిన వారు మాత్రం విరాట్ కోహ్లిపై మండిపడుతున్నారు. ప్రాక్టీస్ విషయంలో కుంబ్లే అనుసరిస్తున్న విధానాలతోనే కోహ్లి విబేధాలు తలెత్తినట్లుగా మొదట్లో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ప్రస్తుత పరిస్థితులలో కెప్టెన్ గా విరాట్ కోహ్లిని తప్పించడం అసాధ్యం గనుక, టీమిండియా భవిష్యత్తు రీత్యా కుంబ్లేనే తనంతట తానుగా వెళ్ళిపోయాడు. ఓ రెండు సంబంధాల మధ్య అయినా ‘పార్టనర్ షిప్’ సరిగా లేకపోతే, అది ముందుకు సాగదని ఈ సందర్భంగా కుంబ్లే చెప్పిన విషయం అక్షర సత్యం.
Following the failure of Vaa Vaathiyaar, Karthi is now all set to return with his…
Andhra Pradesh chief minister, Chandrababu Naidu has been fully committed and dedicated towards the completion…