Telugu

సూపర్… నవ్యాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తున్న కృషితో రాష్ట్రానికి అంతర్జాతీయ దిగ్గజాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘కియా’ మోటార్స్ అనంతపురం జిల్లాలో కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఏటా 3 లక్షల హ్యుందయ్ కార్ల ఉత్పత్తి లక్ష్యంగా 12,910 కోట్లతో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకోనుంది.

అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచిలో 599 ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ ప్లాంట్‌లో 11 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనుండగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. అందులోనూ వెనకబడిన అనంతపురం జిల్లాలో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు కియా ముందుకు రావడంతో ఆ సంస్థకు అల్ట్రా మెగా ఇండస్ట్రీకి ఇచ్చే అన్ని ప్రోత్సాహకాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ADVERTISEMENT

మరో విశేషం ఏమిటంటే… ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన కియా మరో రెండేళ్లలోనే అంటే 2019 నాటికే ప్రయోగాత్మకంగా కార్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. అలాగే అక్టోబరు 2019 నాటికి పూర్తి స్థాయిలో కార్లను ఉత్పత్తి చేయాలని ఏపీ సర్కారు కూడా షరతు విధించింది. 1944లో ఏర్పాటైన కియా మోటార్స్ కంపెనీకి దక్షిణ కొరియాలోని సియోల్‌కు చెందిన సంస్థ. వాహన తయారీ రంగంలో దీనికి ప్రపంచంలోనే ఐదో స్థానం. దీంతో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ సొంతమయ్యింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mahesh Babu Watches Romanchakam, Here’s His Verdict

Sumanth Prabhas and Ananthika Sanilkumar’s Romanchakam has received a major boost on its release day,…

27 minutes ago

‘రోమాంచకం’ సినిమా రివ్యూ: ప్రేమరహితం, హాస్యభరితం, ఉత్కంఠలోపితం!

చిత్రం: రోమాంచకం M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026 తారాగణం: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్…

48 minutes ago