
ఆస్ట్రేలియా పరిస్థితి ఇలా ఉంటే, మరో పక్కన శ్రీలంక జట్టు అత్యంత దయనీయమైన స్థితిలో క్రికెట్ ఆడుతోంది. బంగ్లాదేశ్ – శ్రీలంక – జింబాబ్వే జట్ల మధ్య జరుగుతున్న ట్రై నేషన్ సిరీస్ లో ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడిన శ్రీలంక రెండింటిలోనూ పరాజయం పాలైంది. మొదటి వన్డేలో జింబాబ్వే చేతిలో చావుదెబ్బ తిన్న శ్రీలంకను కోలుకోనివ్వకుండా చేయడంలో బంగ్లాదేశ్ నేడు విజయవంతమైంది. 321 పరుగుల భారీ స్కోర్ ను చేధించలేక కేవలం 157 పరుగులకే లంకేయులు కుప్పకూలారు.
ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టు ఏ స్థితిలో ఉందో ఈ రెండు ఓటములు చెప్పకనే చెప్తున్నాయి. బంగ్లాదేశ్ అంటే టాప్ టీంలను కూడా ఓడించిన ఘనత ఉంది గానీ, చివరికి జింబాబ్వే చేతిలో కూడా ఓటమి పాలు కావడంతో, ఫైనల్స్ కు శ్రీలంక జట్టు అర్హత సాధించే అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలోనూ బంగ్లా విజయాలు అందుకోగా, ఒక విజయం, ఒక ఓటమితో జింబాబ్వే, రెండు పరాజయాలతో శ్రీలంక జట్టు అట్టడుగున ఉంది.
దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టులో నిన్న నీళ్ళు పారాయి. అలాగే దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పోలవరం…
The Telangana political landscape is starting to heat up as Chief Minister Revanth Reddy has…