
“16 నెలలు జైల్లో చిప్పకూడు తినడం వలన నీ చర్మం మందం అయ్యింది. జైలులో తోటిఖైదీలు, ఖాకీల చేతుల్లో దెబ్బలు తినడం వలన నీ ఒంటిపై చారలు ఏర్పడితే వాటిని చూసి పులిని అనుకొంటున్నావు. నిజంగా నువ్వు పులివే అయితే ఒంటరిగా నర్సీపట్నం రా…” అంటూ అయ్యన్న సవాలు విసిరారు.
ఈ నెల 19న తెల్లవారుజామున రెవెన్యూ అధికారులు, పోలీసులు, జేసీబీలను వెంటబెట్టుకొని వెళ్ళి నర్సీపట్నంలోని అయ్యన్న పాత్రుడి కుమారుల ఇంటి ప్రహారీగోడను కూలద్రోశారు. అప్పుడు వారిరువురూ హైకోర్టును ఆశ్రయించగా కూల్చివేతలు నిలిపివేయాలని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మళ్ళీ గోడ పునర్నిర్మించుకోవడానికి వారిని అనుమతించింది కూడా. అయితే ఆ ఘటనలు జరిగినప్పటి నుంచి అయ్యన్నపాత్రుడు స్పందించకపోవడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని విజయసాయి రెడ్డి అన్నారు. దానికే అయ్యన్నపాత్రుడు ఇంత ఘాటుగా బదులిచ్చారు. అది ఎంత ఘాటుగా ఉందో తెలియాలంటే అయ్యన్న పోస్ట్ చేసిన ఈ ట్వీట్స్ మీరూ చూడండి.
In an industry where success often decides everything, some filmmakers continue getting opportunities because of…
As CM Vijay takes his oath today, he carries a heavy burden of suspicion. For…