
సహజంగా ఇటువంటి సందర్భంలో తన సహజశైలిలో విరుచుకుపడే బాలయ్యే మనకు తెలుసు. అయితే ఆయన ఎందుకో ఈ విషయంపై స్పందించడం లేదు. తిరుమలలో ఈ రోజు స్వామి వారి దర్శనం చేసుకుని తిరుపతి పీజేఆర్ మూవీ ల్యాండ్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ … సినిమా విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 100కు పైగా థియేటర్లలో ఎన్టీఆర్ విగ్రహాలు పెడుతున్నామన్నారు.
ఎన్టీఆర్ స్పూర్తితోనే సినిమాల్లోకి వచ్చానని, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాతో తండ్రి రుణం తీర్చుకున్నానని చెప్పుకొచ్చారు ఆయన. నాగబాబు వ్యాఖ్యలపై నో కామెంట్ అంటూ ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు బాలయ్య జవాబు ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేనిది ఈసారి ఈ విషయంలో బాలయ్య ఆవేశం కంట్రోల్ చేసుకోవడం మంచిదే. ఒకవేళ బాలయ్య కూడా దీనిపై స్పందించి ఉంటే ఇది కులాల మధ్య కుంపటిలా అయ్యే అవకాశం ఉందని ఇప్పటికే విశ్లేషకులు వారించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రతిపక్ష హోదా కోసం ఆరాటపడుతున్న వైసీపీ పాత్ర ఏమిటి అనేది గమనిస్తే, వైసీపీ ఏపీలో సీజనల్ పాలిటిక్స్…
Salman Khan recently announced the release date for his next film, which is Eid 2027,…