
హీరోగా బిజీగా ఉండే బాలకృష్ణ రెండు నెలలకు ఓ సారి తన నియోజకవర్గానికి వచ్చిపోతుంటారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం కష్టంగా ఉండడంతో చిత్తూరు జిల్లాకు చెందిన శేఖర్ అనే ఉద్యోగిని తన ప్రతినిధిగా ఇక్కడ నియమించారు. ప్రజలు, పార్టీ శ్రేణులు, తనకు మధ్య అనుసంధానకర్తగా శేఖర్ ఉంటాడని బాలకృష్ణ భావించారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. శేఖర్ ఇప్పుడు నియోజకవర్గంలో కీలకంగా మారిపోయారు. తనకు భద్రత కోసమంటూ గన్ మెన్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. తన మాట వినని వారిపై వేటు వేస్తున్నారు. పార్టీ శ్రేణులను కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
2015లో చిలమత్తూరు మండల టీడీపీ కన్వీనర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన శేఖర్ మండల తెలుగు రైతు అధ్యక్షుడి పైన కూడా వేటు వేసారు. హిందూపురం మాజీ కౌన్సిలర్ను సస్పెండ్ చేశారు. అంతేకాదు నియోజకవర్గంలో సొంత కోటరీ ఏర్పాటు దిశగా పావులు కదుపుతున్నారు. కాంట్రాక్టులు, కమీషన్లతో చెలరేగిపోతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ ఘటనను ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా చెబుతున్నారు. తనకు కప్పం కట్టలేదని లేపాక్షి మండలం కొండూరుకు చెందిన టీడీపీ నేతతో బహిరంగంగానే గొడవకు దిగి చొక్కాలు పట్టుకున్నారని అంటున్నారు.
శేఖర్ తీరుతో సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణను కలిసి తమ సమస్యను వివరించలేని వారు, శేఖర్ను కలిసి తమ బాధలు చెప్పుకునేందుకు కూడా కష్టాలు పడుతున్నారు. అయితే ఆయన దర్శనం కావాలంటే ముగ్గురి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ షాడో ఎమ్మెల్యే తమకు వద్దంటూ నియోజకవర్గంలో మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి మరీ శేఖర్ ఆగడాలపై ధ్వజమెత్తుతున్నారు. తాజాగా ఆదివారం నిర్వహించిన సమావేశానికి 90 శాతానికి పైగా పార్టీ శ్రేణులు హాజరవడం శేఖర్ ఆగడాలకు నిదర్శనమని చెబుతున్నారు. ఇప్పటికైనా బాలకృష్ణ కళ్లు తెరవకపోతే అనంతపురంలో పార్టీకి కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…