
ఇక, నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వారసుడు మోక్షజ్ఞ తెరంగ్రేటంపై స్పందించిన బాలకృష్ణ, ప్రస్తుతం చదువుకుంటున్నాడని, విద్య ఎంత ప్రాముఖ్యమో తన తండ్రి తనకు చెప్పినా అబ్బలేదని, అయితే ఆ తర్వాత బిఎ పట్టభద్రుడిని కావడం వలనే తనకు చరిత్ర గురించి తెలుసుకున్నానని, అలాగే ఆసక్తి పెంచుకున్నానని, ఇపుడు మోక్షజ్ఞ కూడా చదువు పూర్తయిన తర్వాతే సినిమాల్లోకి వస్తాడని తెలిపిన బాలయ్య బాబు… బహుశా వచ్చే ఏడాది చివరికి మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే తీపి కబురుకు అందించారు.
ప్రస్తుతం తానూ నటిస్తున్న “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా 40 శాతం షూటింగ్ ముగిసిందని, ఈ సినిమా తానూ చేయడం ఒక అదృష్టంలా భావిస్తున్నానని, నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కొలువు తీరడం, దానికి సంబంధించిన కధతో తానూ సినిమా చేయడం కాకతాళీయమేనని అభివర్ణించిన ఈ నందమూరి నటసింహం, గౌతమీపుత్ర శాతకర్ణి పాలించిన రాజ్యాలలో అమరావతి మాత్రమే కాకుండా, తెలంగాణాలో కొండాపూర్, కాశీ వద్ద మరో రాజ్యాన్ని పరిపాలించాడని, అంతటి గొప్ప చరిత్ర గల మన తెలుగు రాజు కధ చేయడం గర్వంగా ఫీలవుతున్నానని తెలిపారు.
ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…
కొన్నిసార్లు భ్రమలకు, వాస్తవాలకు తేడా కనిపిస్తున్నా భ్రమలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. భ్రమలు మాత్రం మనం…