
గత కొన్ని రోజులుగా జరుగుతున్న విషయాలపై తాను చాలా కలత చెందానని, ఇది ఒక కుటుంబ సమస్య లాంటిదని… అందరం కలిసి చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుందామని ఆయన తెలిపారు. ఇకపై అందరూ విభేదాలను పక్కన పెట్టి, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిద్దామని బాలయ్య సూచించారు. అంతేకాదు, ఈ నెల 28న అందరూ హైదరాబాద్ కు రావాలని… ఇక్కడ కూర్చుని అందరం చర్చిద్దామని పిలిచారు.
పీఏ శేఖర్ వల్ల నియోజకవర్గంలో టీడీపీ రెండుగా చీలే ప్రమాదం ఏర్పడటంతో… పార్టీ ప్రతినిధిగా హిందూపురంకు వచ్చిన కృష్ణమూర్తి, స్థానిక నేతలతో మాట్లాడి బాలయ్యకు ఓ నివేదిక అందించారు. ఈ నేపథ్యంలోనే నేతలందరినీ హైదరాబాద్ కు రావాలంటూ బాలయ్య పిలుపునివ్వడంలో, అనంతపురం పంచాయితీ కాస్త హైదరాబాద్ కు షిఫ్ట్ చేసినట్లు కనపడుతోంది.
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…
Rinku Singh has once again missed out on India’s T20I squad, and former India batter…