
అటు- విజయవాడతో పాటు, నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం వంటి జిల్లాల్లోనూ ఈ కాల్ మనీ ముఠాల నిర్వాకం బయటపడడం ఖాకీలను కూడా కలవరపరుస్తోంది. అనేక చోట్ల వారు దాడులు జరిపి, వేలాది ప్రామిసరీ నోట్లను, ఇళ్ళ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాను మహిళలు కూడా కొనసాగించడం విశేషం. బాధితుల అవసరాలను ఈ ముఠాలు ఆసరాగా తీసుకుని అధిక వడ్డీలు గుంజుతూ వారి ఆస్తులు, ఇళ్ళ పత్రాలను చేజిక్కించుకుని వీధుల పాల్జేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో తాను తీసుకున్న రెండు లక్షలకు గాను 28 లక్షలు చెల్లించినట్టు ఓ బాధితురాలు వాపోయింది. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చినా తనకు ఓ మహిళ నుంచి బెదిరింపులు అందుతున్నాయని ఆమె వాపోయింది. ఒక్కో చోట ఒక్కో పేరు మీద ఈ వ్యవహారం సాగుతున్నా ఇప్పుడిప్పుడే దీనికి అడ్డుకట్ట పడుతోంది.
Telugu YouTuber Rama Nandana, known online as Nandu’s World, was taken into custody by RGIA…
వైసీపీ మాజీ ఎంపీ గా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన విజయసాయి రెడ్డి వైసీపీ ఘోర ఓటమి…