
ఈ క్రమంలో దీనిపై దృష్టి సారించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. దోవల్ ఆదేశాలతో రంగంలోకి దిగిన నిఘా వర్గాలు ఈ విషయంపై సమగ్ర వివరాలు సేకరించాయి. ఇందులో భాగంగా రోహిత్ తల్లి రాధికతో పాటు అతడి నాయనమ్మ రాఘవమ్మ వాంగ్మూలాలను కూడా సేకరించారు. ఈ వాంగ్మూలంలో తాము వడ్డెరలమేనని పేర్కొన్న రాఘవమ్మ, దళితులం కాదని తేల్చిచెప్పారు. ఈ మేరకు సమగ్ర నివేదికతో పాటు రాధిక, రాఘవమ్మల వీడియో వాంగ్మూలాలను జతచేసిన నివేదికను నిఘా వర్గాలు అజిత్ దోవల్ కు బుధవారం నాడు అందజేశాయి. దీంతో రాజకీయ రంగు పులుముకున్న ఈ కేసు మరో మలుపు తీసుకోబోతుందని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.
Naga Chaitanya's Vrushakarma has reached a point where the silence itself is becoming a problem.…
నందమూరి బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగుతున్నారు. హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్…