
ముఖ్యంగా విశాఖ రైల్వేజోన్ అంశాన్ని మాత్రం ఇందులో ప్రస్తావించారని, అలాగే కేంద్ర సంస్థల ఏర్పాటు, పరిశ్రమలకు రాయితీలు, గ్రాంటు శాతం పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇదే ముసాయిదాలో హోదా ఇవ్వాలని తమకు ఉన్నప్పటికీ, అందుకు అడ్డుపడుతున్న కారణాలను వివరణాత్మకంగా పొందుపరిచినట్టు లభించిన కీలక సమాచారం. ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలకు మరింత ఆర్థిక సహాయం అంశంతో పాటు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా డిప్రీసియేషన్, అలవెన్స్ లను మరికొంత పెంచుతూ ముసాయిదాలో తమ నిర్ణయాన్ని చేర్చినట్టు సమాచారం.
కడపలో స్టీల్ ప్లాంట్, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖతో పాటు విజయవాడ – తెనాలి – గుంటూరులను కలుపుతూ మెట్రో రైల్, చెన్నై – విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి తదితర అంశాలనూ జోడించిన కేంద్రం, ఏపీకి మాత్రమే వర్తించేలా గ్రాంట్ శాతాన్ని పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజధాని మౌలిక అవసరాలను తీర్చేందుకు 4 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ తదితరాంశాలు ఉన్నట్టు సమాచారం. ఏది ఏమైనా గానీ… అంతిమంగా కేంద్రం చెప్తున్న విషయం ఏమిటంటే… ‘ప్రత్యేక హోదా’ విషయంలో మాత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు…’ అంటోంది.
BOTTOM LINE Lengthy But Decent Nostalgia Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Gurmmeet Singh Cast:…
90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి గుర్తుండిపోయే, సున్నితమైన వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ నుంచి సినిమా…