
విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజక వర్గాలను పెంచుకోవచ్చనే సౌలభ్యం విభజన చట్టంలో ఉండడంతో ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 స్థానాలను 225కి, తెలంగాణాలో ఉన్న 119 స్థానాలను 175కు పెంచాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. నిజానికి ఈ పెంపు సాధ్యమవుతుంది కాబట్టే తెలంగాణాలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు ‘ఫిరాయింపులను’ ప్రోత్సహించారని పొలిటికల్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే తాజాగా కేంద్రం ఇచ్చిన వివరణతో ఈ ఇద్దరి ముఖ్యమంత్రులకు పెద్ద జలక్కే ఇచ్చినట్లయ్యింది.
నియోజక వర్గాలను పెంచాలంటే ఖచ్చితంగా 371 ఆర్టికల్ ను సవరించాలని, ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదని స్పష్టత ఇచ్చింది. నిజానికి డీలిమిటేషన్ ప్రకారం 2026 వరకు నియోజకవర్గాల పెంపుదలకు అవకాశం లేకుండా గతంలో పార్లమెంట్ లో చట్టాన్ని రూపొందించారు. దీంతో రాజ్యాంగ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అటార్నీ జనరల్ సంప్రదించగా, తాజాగా అటార్నీ జనరల్ ఇచ్చిన నివేదిక ప్రకారం నియోజక వర్గాల పెంపు ఆశలపై నీళ్ళు చల్లారు.
చిత్రం: రంభ ఊర్వశి మేనక M9 రేటింగ్: 1.5/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 04, 2026 తారాగణం: అల్లరి నరేష్,…
Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…