
అయితే ఆ ఉత్సాహం చంద్రబాబు ఇంటి వద్దే ఆగిపోయింది. సరే జరిగింది ఏదో జరిగింది. ప్రజా ధనం వృథా అయ్యింది. కానీ ఇందులో ఇంకో కోణం కూడా ఉంది. చంద్రబాబు ఉండవల్లి ఇంటికి వెనుకే ఉండే ప్రజావేదికను తనికి కేటాయించాల్సిందిగా చంద్రబాబు అడిగారు. అయినా దానిని కూలగొట్టారు.
పైగా చంద్రబాబు కు ఈ అవమానం నిత్యం గుర్తు రావాలని కనీసం ఆ కూల్చివేత తరువాత మిగిలిన శకలాలను ఇన్ని నెలల తర్వాత కూడా తీయకుండా అలాగే ఉంచేశారు. చంద్రబాబు ఇంటి బయటకు లోపలకు వెళ్లే ముందు వాటిని చూసి కుమిలిపోవాలని ముఖ్యమంత్రి కోరిక. అయితే అవే శకలాలు జగన్ ప్రతీకారేచ్చకు కూడా నిదర్శనమే కదా?
ఇది ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు ఈరోజు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. టీడీపీ నాయకులతో కలిసి బస్సు లో బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన ముందుగా ప్రజావేదిక శకలాలను చూసే బయల్దేరారు. ఆ శకలాలు జగన్ ఏ ఉద్దేశంతో అక్కడ పెట్టించినా అవి మాకు జగన్ ను ఓడించాలనే కసిని మరింత పెంచుతుందని టీడీపీ అభిమానులు అంటున్నారు.
Union Minister and Karimnagar MP Bandi Sanjay’s son Bandi Bhageerath had been in the news…
The trailer for Dharma Productions' upcoming film Chand Mera Dil has been dropped and it…