
“ఈ హౌస్ లో ఎవరైనా ఒకరే ఉండాలి, ఉంటే ప్రత్తిపాటి, లేదంటే జగన్ ఉండాలి. విచారణ వేసి తేలుద్దామా? నా మాటలకు జగన్ అంగీకరించే పక్షంలో జ్యుడీషియల్ విచారణకు ఈ క్షణమే ఆదేశిస్తున్నా” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాగే ప్రతిపక్ష పార్టీ అధినేత నోటికి అదుపు లేకుండా పోయిందని, తనను అనరాని మాటలు అంటున్నారని చెప్తూ… ఇటీవల కాలంలో బహిరంగ సభలో తనను చెప్పుతో కొట్టమన్న సంఘటనను గుర్తు చేసారు ముఖ్యమంత్రి.
“చెప్పుకోకూడదు కానీ, నన్ను అనరాని భాషలో… దేంతో కొట్టమన్నారో కూడా మీరూ విన్నారు. నా నోటి గుండా చెప్పలేకపోతున్నాను. మామూలుగా అయితే ఆ మాట ఒక ఎమ్మెల్యేను సామాన్య వ్యక్తి కూడా అనలేడు. అలాగే సామాన్యులు కూడా ఒకరినొకరు అనుకోలేరు. ఎవరికైనా రోషం ఉంటుంది. మనకు కూడా రక్తం, మాంసం… ఒక ఆలోచన, ఒక విధానం, జీవితం ఇవన్నీ ఉన్నాయి. అయినా ఆ మాటలను ఎందుకు భరించానంటే.. ప్రజల కోసమేనని” ఆవేదన వ్యక్తం చేసారు చంద్రబాబు.
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…