
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నాలుగైదు రోజుల క్రితమే రైతులను పరామర్శించి తక్షణం ధాన్యం కొనుగోలుచేయాలని లేకుంటే నిరసనదీక్ష చేస్తానని హెచ్చరించారు. అయినా ప్రభుత్వంలో పెద్దగా కదలిక కనిపించలేదు. అందుకే వ్యవసాయశాఖ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి ఫోటో పెట్టి ‘కనిపించుటలేదు’ అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ట్వీట్స్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో సిఎం నుంచి మంత్రుల వరకు అందరి తీరు ఒకేలా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
మొన్న ఏలూరులో రైతులను పరామర్శించడానికి వెళ్ళిన ఒకే ఒక్క మంత్రిపౌరసరఫరాల మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వర రావు అక్కడ ఓ రైతన్న తన గోడు మొరపెట్టుకొంటుంటే, “ఒరేయ్ ఎర్రిపప్పా… నోరుమూసుకో…” అంటూ చులకనగా మాట్లాడారు.
రాష్ట్రంలో రైతులు పంట నష్టపోయి తల్లడిల్లుతుంటే, సిఎం జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు వారిని పరామర్శించలేదు. కనీసం హెలికాఫ్టర్లో తిరిగి ఏరియల్ సర్వే చేయలేదు. కానీ నేడు విశాఖలో తండ్రి వైఎస్సార్ విగ్రహావిష్కరణ, నేవీ మ్యూజియం ప్రారంభోత్సవానికి, చివరిగా వైసీపీ నేత ఇంట్లో జరుగుతున్నా ఓ శుభకార్యాక్రమానికి వెళుతున్నారు.
పంటలు నష్టపోయి ఆవేదన చెందుతున్న రైతులను పరామర్శించడం కంటే ఈ విగ్రహావిష్కరణలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ముఖ్యమా?అని టిడిపి ప్రశ్నిస్తోంది. టిడిపి, జనసేనల ప్రశ్నకు మంత్రులు అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్ తదితరులు సమాధానాలు సిద్దం చేసుకొంటున్నట్లున్నారు. ఫ్యాన్స్ వెయింటింగ్ ఇక్కడ!
Prakash Raj has built an image as a fearless political voice, someone who questions power…
Tumbbad 2 has officially gone on floors after a long wait from fans. The sequel…