
నీళ్లలో వ్యర్థాలను తొలగించేందుకు వలలు వినియోగించాలని, పుష్కర్ నగర్ లు, రహదారులపై చెత్త లేకుండా చూడాలని, పుష్కర ఘాట్ల వద్ద పారిశుద్ధ్య బాధ్యతలను అగ్నిమాపక సిబ్బంది, నీళ్లలో పారిశుద్ధ్య బాధ్యతలను మత్స్య శాఖ సిబ్బంది చూడాలని అన్నారు. ఎక్కడా వ్యర్థాలు పోగవకుండా చూడాలని, ప్రతి ఘాట్ వద్ద వాటర్ లెవెల్ ఇండికేటర్లు ఏర్పాటు చేయాలని, నీటి మట్టం లోతు తెలిస్తేనే యాత్రికులు అప్రమత్తంగా ఉంటారని, సెలవు రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, సిబ్బందికి చంద్రబాబు హితబోధ చేసారు.
కృష్ణానదిలో నీళ్లు బాగా లేవు, బ్యాక్టీరియా ఉందనే దుష్ప్రచారం జరుగుతోందని, దీనిని అధికారులు, సిబ్బంది ఖండించాలని తెలిపారు. స్వామీజీలు, పీఠాధిపతులు పుష్కర స్నానం చేసిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని చంద్రబాబు కోరారు. ప్రభుత్వ సదుపాయాల వివరాల బోర్డులను అన్ని చోట్ల ఏర్పాటు చేయాలని, పుష్కర ఏర్పాట్లపై ప్రజల్లో వంద శాతం సంతృప్తి నెలకొనాలన్నారు. పుష్కర స్నానానికి వచ్చే వికలాంగులు, వృద్ధులకు హోంగార్డులు సాయపడాలని, గజ ఈతగాళ్లందరూ అప్రమత్తంగా ఉండాలని, వంతెనల వద్ద పోలీస్ పహారా ఉండాలని, పిండ ప్రదానం అధికంగా జరిగే ఘాట్ల వద్ద టెంట్లు విస్తృతంగా ఏర్పాటు చేయాలని పలు సూచనలు చేసారు.
ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దేని ఓటు బ్యాంకులు దానికున్నాయి. ముఖ్యంగా…
Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…