
ఇలా పలు సందర్భాలలో తనకు రావాల్సిన గుర్తింపు రాకపోవడంపై, పలు విధాలుగా అసంతృప్తి ప్రకటించిన మోహన్ బాబుకు తాజాగా ‘నవరస నట తిలకం’ బిరుదుతో సత్కరించనున్నారు టి.సుబ్బిరామిరెడ్డి. విశాఖపట్టణం, టీఎస్సార్ లలిత్ కళా పరిషత్ ఆధ్వర్యంలో మునిసిపల్ స్టేడియంలో ఈ నెల 17న జరగబోతున్న వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ వంటి హేమాహేమీలు తరలిరానున్నారు. అలాగే అలనాటి అందాల బొమ్మ ‘అతిలోకసుందరి’ శ్రీదేవితో పాటు జయసుధ వంటి తారామణులు కూడా హాజరు కానున్నారు.
అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి – మోహన్ బాబులకు జరిగిన ఉదంతాల రీత్యా, చిరు సమక్షంలోనే మోహన్ బాబు ఈ బిరుదు అందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఈ వేడుకలో ఎలాంటి సంచలన ప్రకటనలు వెలువడతాయోనని సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బహిరంగ వేడుకలపై తనంతట తానూగా చిరు ఎలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయరన్న నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉండడంతో, ‘కలెక్షన్ కింగ్’ ప్రసంగం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
The box office results have become very unpredictable. Amid this, the situation of every big…
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…