
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలోని కొన్ని మండలాలు ఏపీలో కలిశాయని, ఈ ముంపు మండలాలు ఏపీ పరిధిలో ఉంటేనే ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు పునరావాస కార్యక్రమాలు సంపూర్ణమవుతాయని దేవినేని చెప్పారు. ఐదు గ్రామాలను తెలంగాణకు బదలాయించేందుకు చంద్రబాబు హామీ ఇచ్చారని కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని ఆరోపణలు చేసిన దేవినేని, అసలు చంద్రబాబు దీనిపై మరో ఆలోచన చేయలేదని, కేసీఆర్ కు కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. చట్టప్రకారం తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన ఏ ఒక్క గ్రామాన్ని కూడా తెలంగాణకు బదలాయించేది లేదని కూడా దేవినేని తేల్చిచెప్పారు.
Reports about a sequel to 3 Idiots have been creating strong excitement among movie lovers…
Bandhavi Sridhar is turning everyday indoor fashion into a full blown style statement with this…