
కానీ అంతవరకు తమ అధినేత మెప్పు కోసం అందరూ వంతపాడక తప్పదు కనుక మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా శ్రీకాకుళంలో గడప గడపకి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ‘విశాఖపట్నమే మన రాజధాని’ అంటూ నినదించారు. కానీ ప్రజలు ఎవరూ స్పందించకపోవడంతో ఆయన షాక్ అయ్యారు.
వారిపై ధర్మాన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, “ఏం విశాఖ మన రాజధాని కావడం మీకెవరికీ ఇష్టం లేదా?విశాఖ మన రాజధాని అని అనడానికి మీకెవరికీ నోరు పెగలదా?విశాఖ రాజధాని అంటే ఏదో నోట్లోనే గొణుకొంటున్నారు! సంక్షేమ పధకాల గురించి గట్టిగానే మాట్లాడుతారు కదా? అప్పుడూ ఇలాగే మౌనంగా ఊరుకోవచ్చు కదా?విశాఖ రాజధాని అయితే మీరు, మీ పిల్లలు అందరూ బాగుపడతారు. మన జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది. కనుక నేను విశాఖపట్నం అని అనగానే మీరందరూ గట్టిగా మన రాజధాని అని నినాదం చేయాలి సరేనా?అని హెచ్చరించడంతో ఆయనను కాదనలేక స్థానికులు నినదించారు
ధర్మాన సొంత నియోజకవర్గంలో ప్రజలకే ఈ మూడు రాజధానుల ప్రతిపాదన ఇష్టం లేదని, ఆయన వారి చేత బలవంతంగా ‘జై’ కొట్టించాల్సి వచ్చిందని అర్దమవుతోంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, వారి అభీష్టం ఏవిదంగా ఉందో తెలుసుకోకుండా తన మనసులో పుట్టిన ఆలోచనలనే ప్రజాభిప్రాయాలుగా బలవంతంగా వారిపై రుద్దాలని చూస్తే ఫలితం ఇలాగే ఉంటుంది.
సుదీర్గ రాజకీయానుభవం కలిగిన మంత్రి ధర్మానకు ఈ విషయం తెలియదనుకోలేము. కానీ పిల్లి మెడలో గంటెవరు కడతారు?అన్నట్లు పార్టీలో సీనియర్లందరూ తమ అభిప్రాయాలను పక్కన పెట్టి తమ అధినేతకు వంతపాడుతున్నారని భావించవచ్చు. కానీ ఈ మూడు రాజధానుల ప్రతిపాదనే వచ్చే ఎన్నికలలో తమ కొంప ముంచుతుందేమో?అని అందరూ లోలోన భయపడుతూనే ఉండవచ్చు. ఇటు తమ అధినేతకు చెప్పలేక, ప్రజలకు నచ్చజెప్పలేక ఇబ్బంది పడుతున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే జాలేస్తుంది.
ఒకే రక్తం పంచుకు పుట్టిన వారికైనా డీఎన్ఏ వేర్వేరుగా ఉంటుంది. ప్రతీ దుకాణానికి వేర్వేరుగా క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. కానీ…
The most recent case of a cinema superstar becoming a political star in South Indian…