Telugu

తమిళనాడు సిఎంగా పళనిస్వామి ఖరారు?

తమిళనాడు రాజకీయాలు కొత్త ముఖ్యమంత్రి దిశగా సాగుతున్నాయి. శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా వస్తారని భావిస్తూ వచ్చిన పన్నీర్ సెల్వం ఆశలు అడియాసలుగా మిగిలిపోనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత పది రోజులుగా, పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమైన వేళ, తాజాగా శశికళ జైలుకు వెళ్లిన తరువాత కూడా పన్నీర్ వర్గంలోకి ఎవరూ వచ్చి చేరకపోవడంతో పన్నీర్ కు అవకాశం లేకుండా పోయిందనేది తాజా సమాచారం.

శశికళ సూచించినట్టుగా అందరమూ ఏకతాటిపై పళనిస్వామి వెంటే ఉన్నామన్న సంకేతాలు ఎమ్మెల్యేల నుంచి వస్తున్న వేళ, ఆయనే కాబోయే సీఎం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సభలో 117 మంది ఎమ్మెల్యేలను చూపి ఆయన మెజారిటీని నిరూపించుకునే అవకాశాలే అధికంగా ఉన్నాయని, స్టాలిన్ రంగంలోకి దిగి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ఫిరాయింపుల దిశగా ప్రోత్సహిస్తే తప్ప పళనిస్వామిని అడ్డుకోలేరని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం పళనిస్వామి క్యాంపులో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం.

ADVERTISEMENT

124 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని చెబుతూ, అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత పళనిస్వామి, గవర్నర్ కు లేక ఇచ్చిన నేపథ్యంలో, ఆయన్ను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవవచ్చని రాజ్ భవన్ వర్గాల నుంచి సంకేతాలు అందినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన వెలువడుతుందని, పన్నీర్ సెల్వం ఏ విధమైన లేఖా ఇవ్వనందున, ఆయన రాజీనామా చేసి వున్నందున రాజ్యాంగ నిబంధనల ప్రకారం, పళనిస్వామిని పిలవాలని రాజ్యాంగ నిపుణులు సూచించిన నేపథ్యంలో విద్యాసాగర్ రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ప్రధాని మోడీకి జవాబు చెప్పలేని నిస్సహాయ స్థితిలో కేసీఆర్‌!

తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు మూడు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ హైదరాబాద్‌ పర్యటనతో రాష్ట్ర…

10 minutes ago

Age is Just a Number: Modi’s ‘Superhuman’ May Sprint!

Prime Minister Modi’s relentless energy is the ultimate case study in discipline. Just days ago,…

30 minutes ago