
శశికళ సూచించినట్టుగా అందరమూ ఏకతాటిపై పళనిస్వామి వెంటే ఉన్నామన్న సంకేతాలు ఎమ్మెల్యేల నుంచి వస్తున్న వేళ, ఆయనే కాబోయే సీఎం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సభలో 117 మంది ఎమ్మెల్యేలను చూపి ఆయన మెజారిటీని నిరూపించుకునే అవకాశాలే అధికంగా ఉన్నాయని, స్టాలిన్ రంగంలోకి దిగి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ఫిరాయింపుల దిశగా ప్రోత్సహిస్తే తప్ప పళనిస్వామిని అడ్డుకోలేరని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం పళనిస్వామి క్యాంపులో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం.
124 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని చెబుతూ, అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత పళనిస్వామి, గవర్నర్ కు లేక ఇచ్చిన నేపథ్యంలో, ఆయన్ను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవవచ్చని రాజ్ భవన్ వర్గాల నుంచి సంకేతాలు అందినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన వెలువడుతుందని, పన్నీర్ సెల్వం ఏ విధమైన లేఖా ఇవ్వనందున, ఆయన రాజీనామా చేసి వున్నందున రాజ్యాంగ నిబంధనల ప్రకారం, పళనిస్వామిని పిలవాలని రాజ్యాంగ నిపుణులు సూచించిన నేపథ్యంలో విద్యాసాగర్ రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…