
భావన కిడ్నాప్ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు అడిషనల్ డీజీపీ బీ సంధ్య నేతృత్వంలో దినేంద్ర కస్యప్ ను విచారణ అధికారిగా నియమించగా, ఈ కేసులో మరో ఇద్దరిని కోయంబత్తూరులో అరెస్ట్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం ఆరుగురికి ఈ కేసులో భాగం ఉందని, ఇప్పటివరకూ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. కాగా ఈ విషయంలో మీడియాతో ఎక్కువగా మాట్లాడవద్దని భావనకు సలహా ఇచ్చామని, సాధ్యమైనంత త్వరగా నిందితులందరినీ అరెస్ట్ చేస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
మళయాళం సినీ పరిశ్రమలోని నిందితులకు, బాధితురాలికి మధ్య గతంలో ఉన్న సంబంధాలు చెడిపోవడంతోనే వారు పగబట్టి ఈ కిడ్నాప్ ప్లాన్ చేశారని తెలిపారు. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకోవడంతో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే దీనిపై ప్రకటన చేసి, నిందితులను త్వరగా పట్టుకుంటామని చెప్పారు. సిఎం చెప్పిన కొద్ది గంటల్లోనే పోలీసులు మరో ఇద్దరినీ అరెస్ట్ చేసి, మొత్తం ముగ్గురిని లోపల వేసి విచారణ జరుపుతున్నారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తుంటే, ఇక తమకు రక్షణ ఎలా ఉంటుందని వాపోవడం ముద్దుగుమ్మల వంతవుతోంది.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…