
‘ప్రత్యేక హోదా’పై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో దాని స్థానంలో భారీగా ‘ప్రత్యేక సహాయం’ చేయాలని కేంద్రం తలపిస్తోంది. అయితే ఈ ప్యాకేజీ ఏపీ ప్రజలను సంతోషపెట్టేలా ఉండేలా చూడాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ… కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. మిత్రపక్షం టీడీపీలో వెల్లువెత్తుతున్న నిరసనలపై ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వద్దకు వెళ్లిన వెంకయ్య నాయుడు… టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి సుజనా చౌదరిని కూడా వెంట తీసుకెళ్లారు. ప్రత్యేక హోదాను మాత్రమే తమ రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారని, దాని స్థానంలో ఎన్ని కోట్లిచ్చినా వారిని సంతోషపెట్టలేరని సుజనా చౌదరి నేరుగా జైట్లీకి చెప్పినట్లు సమాచారం. అయితే ఏపీ ప్రజలను తమ ప్యాకేజీతో తప్పనిసరిగా సంతోష పెడతామని, అందుకు ఒకటి, రెండు రోజులు మాత్రమే ఆగాలని అరుణ్ జైట్లీ చెప్పడంతో… ఏపీకి ప్రత్యేక సాయంగా క్రింద ప్యాకేజీని ప్రకటించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.
ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దేని ఓటు బ్యాంకులు దానికున్నాయి. ముఖ్యంగా…
Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…