
నియోజకవర్గాల పెంపుతోనే అది సాధ్యమవుతుందన్న నమ్మకంతో జంప్ జిలానీలకు ఎడాపెడా హామీలు ఇచ్ఛాయి. అయితే కొంతకాలంగా ఈ విషయంలో ఎటువంటి కదలిక లేకపోవడం, రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది గనుక ఇప్పట్లో ఇది సాధ్యమయ్యే విషయం కాదనడంతో కొంత నిరుత్సాహం చెందాయి. కానీ, తాజాగా ఈ ప్రతిపాదనలో కదలిక రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏపీలో ఉన్న 175 స్థానాలను 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంది.
ఈ విషయంలో గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తేవడంతో నియోజకవర్గాల పెంపు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు ‘అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్’ పంపాలని కేంద్ర న్యాయశాఖ రెండు తెలుగు రాష్ట్రాలను కోరింది. లోక్ సభ స్థానాల పెంపు సాధ్యం కాకపోవడంతో, వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలను మాత్రం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను తొమ్మిదికి పెంచాలని కేంద్రం భావిస్తోంది.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…