
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఫోరెన్సిక్ నివేదిక ఇంకా రావలసి ఉంది. ఒకవేళ వారి నివేదికలో మా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో అసలైనదే అని తేలితే తప్పకుండా ఆయనపై చర్యలు తీసుకొంటాము. కానీ ఇదేదో చాలా పెద్ద వ్యవహారమన్నట్లు టిడిపి నేతలు మాట్లాడుతున్నారు. నిజానికి ఓటుకు నోటు కేసు దీని కంటే చాలా పెద్దది. దానిలో డబ్బు, వీడియో ఇతర సాక్ష్యాధారాలు లభించినప్పటికీ ఆ ఆడియో సంభాషణలో అది చంద్రబాబు నాయుడు గొంతో కాదో నేటి వరకు తేలలేదు,” అని అన్నారు.
సజ్జల మాటలను బట్టి జగన్ ప్రభుత్వం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కేసును ఎటూ తేలకుండా నాన్చి ఈ వేడి తగ్గి మరో అంశం తెరపైకి వచ్చినప్పుడు మెల్లగా అటకెక్కించేయాలని అనుకొంటోదేమో?అయితే ఇటువంటి ఎంపీ పక్కన శాసనసభలో వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు కూర్చోనే సాహసం చేయగలరా?ఆయనతో ఇదివరకులా మాట్లాడగలరా?అని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తే తప్పకుండా చర్యలు తీసుకొని ఉండేది.
In an industry where success often decides everything, some filmmakers continue getting opportunities because of…
As CM Vijay takes his oath today, he carries a heavy burden of suspicion. For…