
తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా కట్టడి చేయడంలో ఆసీస్ బౌలర్లు సఫలమయ్యారు. తొలి 25 ఓవర్లలో మూడవ వికెట్లు కోల్పోయి కేవలం 101 పరుగులు జోడించిన టీమిండియా, 42 ఓవర్లకు 281 పరుగులు చేసిందంటే, చివరి 17 ఓవర్లలో 180 పరుగులు నమోదు చేసింది. ఇందులో తను ఎదుర్కొన్న చివరి 40 బంతుల్లో 103 పరుగులు చేసి హర్మాన్ ప్రీత్ కౌర్ ఆసీస్ బౌలర్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. మొత్తంగా 115 బంతులను ఎదుర్కొన్న కౌర్ 20 ఫోర్లు, 7 సిక్సర్లతో ఏకంగా 171 పరుగులతో అజేయంగా నిలిచింది.
భారీ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన కంగారులు 21 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ ను విలాని (75), బ్లాక్ వెల్ (90) ఆదుకున్నారు. అయితే మరో వైపు క్రమం తప్పకుండ వికెట్లు పడిపోవడంతో 169 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. అయితే చివరి వికెట్ కు 76 పరుగులు జోడించిన తర్వాత బ్లాక్ వెల్ అవుట్ కావడంతో, టీమిండియా విజయం ఖరారైంది. ఒంటి చేత్తో భారత విజయానికి కారణమైన హర్మాన్ ప్రీత్ కౌర్ కు ‘ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Ravi Teja’s Irumudi has become the sensational blockbuster of the year, with the film now…
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…