
హెచ్సీఎల్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు రాష్ట్రానికి రావడంతో నవ్యాంధ్రలో ఐటీ శకం ప్రారంభమైందని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుమల వెంకన్న దర్శనానికి ఆరు నెలలకు ఓ మారు రాష్ట్రానికి వచ్చే శివనాడర్ ఇకపై తన సంస్థ బాగోగులు చూసుకునేందుకు మూడు నెలలకో మారు రావాల్సి ఉంటుందంటూ చమత్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 980 ఐటీ కంపెనీలు ఉన్నాయని, వాటిలో పది శాతం కంపెనీలను రాష్ట్రానికి రప్పించగలిగితే రాష్ట్ర యువతకు 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని శివనాడర్ పేర్కొన్నారు.
అలా చేయగలిగితే మైక్రోసాఫ్ట్ కూడా వస్తుందన్నారు. ఉద్యోగాలు చేసేందుకు గృహిణులు ముందుకొస్తే వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. చంద్రబాబు భరోసాతోనే విజయవాడలో తమ సంస్థ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు శివనాడర్ పేర్కొన్నారు. హెచ్సీఎల్ వంటి ప్రముఖ సంస్థలు రావడం పట్ల ప్రజల్లోనూ ప్రభుత్వం పట్ల పాజిటివ్ సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఒప్పందాలన్నీ త్వరితగతిన కార్యరూపం దాల్చేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది.
రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…
Well, the inevitable has happened as the Telangana government under the leadership of Chief minister…