హైకోర్టు ఆదేశాలు! రజనీ పాటించాల్సిందే!

‘కొచ్చాడియాన్’ మొదలైన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కష్టాల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం రజనీనే కాక ఆయన కుటుంబాన్ని కూడా తాజా పరిణామాలు సతమతం చేస్తున్నాయి. తాజాగా చెన్నైలోని ‘ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ స్కూల్’ స్థల వివాదానికి సంబందించిన విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాల్సిందేనని మద్రాస్ హైకోర్టు తేల్చిచెప్పింది.

ఈ మేరకు రజనీకాంత్ తో పాటు ఆయన సతీమణి లతా రజనీకాంత్ కు కూడా సమన్లు జారీ చేసింది. రజనీకాంత్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పాఠశాల ప్రతినిధి పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. అవసరమైతే గడువు పెంచుతామన్న కోర్టు, వ్యక్తిగత హాజరు నుంచి రజనీకాంత్ కు మినహాయింపు ఇవ్వలేనని తేల్చిచెప్పింది. దీంతో భార్యతో కలిసి రజనీకాంత్ కోర్టు మెట్లెక్కక తప్పని పరిస్థితి నెలకొంది.

ADVERTISEMENT
Share
Published by

Recent Posts

Naga Chaitanya’s Vrushakarma: Makers Playing with Fire?

Naga Chaitanya's Vrushakarma has reached a point where the silence itself is becoming a problem.…

8 minutes ago

బాలయ్య వారసత్వం మోక్షజ్ఞ చేతుల్లో… అసలు పరీక్ష మొదలు

నందమూరి బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగుతున్నారు. హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్…

8 minutes ago