
తొలి సెషన్ వరకు చాలా నెమ్మదిగా కొనసాగించిన బ్యాటింగ్ ను రెండవ సెషన్ లో పరుగులు పెట్టించారు. ఆ క్రమంలో అర్ధ సెంచరీ ముగించుకుని, సెంచరీ దిశగా అడుగులు వేస్తున్న రూట్ ను జడేజా వెనక్కి పంపాడు. స్వీప్ షాట్ ఆడబోయి వికెట్ కీపర్ పార్తీవ్ పటేల్ కు చిక్కిన రూట్ ను ఎంపైర్ అవుట్ గా ప్రకటించకపోవడంతో, రివ్యూకు వెళ్ళిన ఇండియాకు కలిసొచ్చింది. టీవీ రిప్లైలో బ్యాట్ ఎడ్జ్ ను బాల్ తాకిందని స్పష్టం కావడంతో రూట్ (88) నిరుత్సాహంతో వెనుదిరిగాడు.
ఆ తర్వాత మొయిన్ అలీకి జత కలిసిన బెయిర్ స్టో స్కోర్ బోర్డు ను ముందుకు నడిపించారు. ఈ క్రమంలో అలీ సెంచరీని పూర్తి చేసుకోగా, బెయిర్ స్టోను 49 పరుగుల వద్ద జడేజా పెవిలియన్ పంపాడు. 253 పరుగుల వద్ద 4వ వికెట్ ను కోల్పోయిన జట్టు, మరో వికెట్ కోల్పోకుండా మొయిన్ అలీ, స్టోక్స్ జాగ్రత్తపడ్డారు. ఆట ముగిసే సమయానికి అలీ 120, స్టోక్స్ 5 పరుగులతో నాటౌట్ గా నిలువగా, ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది.
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…