
కొంతమంది తల్లిదండ్రులు తెలుగులో బోధించాలని కోరినా, తెలుగు మీడియం క్లాసులు పెట్టడానికి ఖర్చవుతుంది కాబట్టి, కేవలం మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ పెడుతుందంట ప్రభుత్వం. అంటే మొత్తం ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం స్కూళ్ళు కనీసం 10 శాతం కూడా ఉండబోవు.
మాతృభాషలో విద్యాబోధన ఉండాలని విద్యాహక్కు చట్టం చెప్పిన మాట వాస్తవమేగానీ, అదొక్కటే ముఖ్యం కాదు కాబట్టి, ఇంగ్లిషు మీడియం పెడుతున్నారట. పేద పిల్లలు మధ్యలో బడిమానేయడానికి తల్లిభాషలో పాఠాలు చెప్పకపోవడం ఒక్కటే కారణం కాదని, ఇతర కారణాలు కూడా ఉన్నాయని, అందువల్ల ఇంగ్లిషు మీడియం వల్ల నష్టం ఉండదని వాదన కూడా తెర మీదకు తీసుకొచ్చింది ప్రభుత్వం.
ఇది ఇలా ఉండగా… ఈ జీవోలో ఇంకో కొసమెరుపు కూడా ఉంది. తెలుగు మీడియం స్కూళ్ళు పెట్టడానికి మనసు రాని ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న మైనారిటీ మీడియం స్కూళ్లు… ఉర్దూ, కన్నడ, తమిళం, ఒరియా స్కూళ్లు మాత్రం కదిలించదట. తెలుగు నేల మీద కనీసం పరాయి భాషలకు దక్కిన గౌరవం కూడా తెలుగు భాషకు దక్కలేదు.
Following the failure of the recently released Kara, Dhanush is currently acting as the lead…
For decades, Aamir Khan built his reputation by going against mainstream Bollywood formulas. At a…