
“తన ప్రమేయం ఏమి లేకపోయినా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహా అధికార పార్టీ నేతలు తనపై నిరాధార ఆరోపణలు చేసారని, తుని ఘటనతో తనకేమి సంబంధం లేదని, తమను రాజకీయంగా ఎదుర్కొలేక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు తన రాజకీయ భవిషత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతున్నారని, ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు చూస్తున్నారని, వీటిని ఢిల్లీ వర్గాలకు సైతం ఫిర్యాదు చేయడానికి వెళ్తామని” సదరు విషయాలన్నీ గవర్నర్ కు వివరించినట్లుగా జగన్ మీడియాకు తెలిపారు.
అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే… జగన్ చెప్పినవే వాస్తవాలని అనుకున్నా… అధికార పార్టీ ఏ స్థాయిలో అయితే ప్రతిపక్షంపై ఆరోపణలు గుప్పించిందో, అదే స్థాయిలో ప్రతిపక్షంగా ఉన్న జగన్ వర్గం కూడా అధికార పార్టీ వారిపై ఆరోపణలు గుప్పించారు కదా! మరి వారు చేసినవి నిరాధారమైతే, మరి ప్రతిపక్షం వారు చేసిన ఆరోపణలకు ఆధారాలు ఎందుకు చూపించలేకపొతున్నారు..? అన్న ప్రశ్నలు రాజకీయ విశ్లేషకులకే కాదు, సామాన్య ప్రజల మదిలో కూడా మెదులుతున్నాయి. అంత బాధ్యతగా ఉన్నానని చెప్పుకునే జగన్, మరి ఆ నిరాధార ఆరోపణలు ఎందుకు చేసారో..?
తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…
అవును! నిజమే! జగన్ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…