
సిఎం అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించడం. దానికి నాయకత్వ లక్షణాలతో పాటు రాష్ట్రంలోని అన్ని శాఖలపై పట్టుండాలి. అలాగే ఎవరితో ఎలా మెలగాలో తెలిసి ఉండాలి. ఇప్పటివరకు ఇలాంటి సిఎం లక్షణాలను పవన్ లో ఇసుమంత కూడా చూడలేదన్నది వివాదానికి తావు లేని అంశం. అందుకే ‘ప్రతిసారి తనకు అధికారం ముఖ్యం కాదు’ అంటూ తనలోని నాయకత్వ లక్షణాలను పరోక్షంగా వెల్లడించుకున్నారు. మరి పవన్ కాకపోతే, ‘జనసేన’ ఎన్నికల బరిలో ఎందుకు దిగుతోంది?
దేశానికి ప్రధాని మన్మోహన్ అయినా, అసలు ప్రధాని ఎవరు అన్నది అందరికీ తెలిసిన విషయమే. మన్మోహన్ పరిపాలనాదక్షతను ఉపయోగించుకుని బ్యాక్ గ్రౌండ్ లో చక్రం తిప్పిన వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదనుకుంటా! ఒకవేళ జనసేన గెలిచినా, సేం సీన్ రిపీట్ అవుతుంది. మరి ఆ సీట్లో కూర్చునేవారెవరు? అంటే అప్పుడు రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. ఒకరు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాగా, మరొకరు లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్.
అయితే… వీరిద్దరిలో కూడా కిరణ్ ముందువరుసలో ఉండడానికి కారణాలున్నాయి. ముఖ్యమంత్రిగా చేసిన అనుభవమే కాక, రాజకీయాలలో ఎవరిని, ఎక్కడ నొక్కాలో అన్న రాజకీయ శైలి కిరణ్ కు బాగా తెలుసు. అందులోనూ వర్తమాన రాజకీయ నేతలు చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డిల రాజకీయ జీవితాల గురించి బాగా తెలిసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. ఇవన్నీ పరిశీలనలోకి తీసుకున్న తర్వాతే… జనసేనలోకి కిరణ్ కుమార్ రెడ్డి చేరిక వార్తలకు ప్రాధాన్యత దక్కింది.
ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా తన వ్యక్తిగత జీవనం సాగిస్తున్న కిరణ్ పై ఏపీ ప్రజలలో ఎంతో కొంత పాజిటివ్ సంకేతాలు ఉండడం జనసేనకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. నాడు కాంగ్రెస్ అధినేత్రిపై పోరాటం చేసిన వ్యక్తిగా, అలాగే విభజనను అడ్డుకోవాలని కనీసం తన వంతు ప్రయత్నంగా చేసిన కృషి కిరణ్ కున్న ప్రధాన ప్లస్ పాయింట్స్. దీంతో జనసేన తరపున కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగడం, కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం కూడా తధ్యం అన్న టాక్ రాజకీయ వర్గాల్లో బలంగా వినపడుతోంది.
తెలంగాణ అధికార పార్టీ లో కొండా సురేఖ వివాదం ఆరని చిచ్చు మాదిరి అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది…
Fans finally have a major update on Dragon, the much-awaited collaboration between Jr. NTR and…