
త్వరలోనే నియోజకవర్గ కమిటీలు ప్రకటిస్తామని, ఎన్నికల నాటికి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని ఈ సందర్భంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్నిస్థానాల్లోనూ పోటీ చేస్తామని ఆయన చెప్పారు. ఒకవేళ అదే నిజం అయితే జనసేన వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా పోటీ చేస్తాడని అనుకోవాలి.
తమ పార్టీలో పవన్కళ్యాణ్ మాత్రమే సుప్రీమ్ అని, ఆయన మాటే శిలాశాసనమని తెలిపారు. పవన్కళ్యాణ్ అనంతపురం జిల్లానుంచి పోటీ చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో పార్లమెంటు స్థానానికి 20 మంది చొప్పున 42 స్థానాలకు 840 మంది సమన్వయకర్తలను నియమించేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది. ఔత్సాహిక శిబిరాలకు హాజరైన వారి నుంచి సమన్వయకర్తలను ఎంపిక చేస్తారు.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…