
ఈ 597 మంది కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని చెప్పిన నేతలు, ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేయనున్నట్లుగా తెలిపారు. అంటే ‘పురుచ్చతలైవి’ పేరు క్రింద చనిపోయిన కుటుంబాలకు మొత్తం 17,91,00,000 రూపాయలు ఆర్ధిక సాయంగా ఖర్చు చేయనుందన్న మాట. ఇవి కాక, గాయపడిన మరో ఇద్దరు అభిమానులకు చెరో 50 వేల రూపాయలు చొప్పున ఒక లక్ష రూపాయలు ప్రకటించారు.
దీంతో మొత్తం 17 కోట్ల 92 లక్షల రూపాయలను జయలలిత మరణం తర్వాత, ఆమె పేరుతో ఖర్చు చేయనున్నారన్న మాట. మరి ఇక్కడితో లెక్క ఆగుతుందో లేక మరింతగా కొనసాగుతుందో తెలియని పరిస్థితి. గతంలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ మరణించిన సమయంలో కూడా ఇలాంటి లెక్కలే వెలువడగా, ఆ లెక్కల్లో బొక్కలు ఉన్నాయంటూ ప్రతిపక్ష పార్టీలు మండిపడిన విషయం తెలిసిందే. అయితే జయలలిత అభిమానుల మరణం విషయంలో ప్రతిపక్షాలు ఎలాంటి ఆరోపణలు చేయకపోవడం విశేషం.
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…