
అయితే ‘కాటమరాయుడు’ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో మరోసారి కృష్ణాజిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ వార్తల్లోకెక్కారు. ‘కాటమరాయుడు’ హక్కులను తక్కువ ధరకు తనకు ఇస్తానని చెప్పి, ఇప్పుడు వేరెవరికో ఇచ్చి తనకు అన్యాయం చేసారని, ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించి, తనకు న్యాయం జరిగే వరకు తానూ హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ వద్ద నిరాహార దీక్ష చేస్తానని చెప్తూ… ఫిల్మ్ చాంబర్ ఎదుటే బైటాయించడంతో, ఈ పరిణామాలు మార్చి 24వ తేదీన ముహూర్తం పెట్టుకున్న ‘కాటమరాయుడు’ విడుదలకు ఆటంకం కలిగిస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీక్షకు దిగిన సంపత్ కుమార్, కోర్టులకెక్కితే ‘కాటమరాయుడు’కు ఎదురుదెబ్బ తప్పకపోవచ్చని, దాని కంటే ముందుగానే సదరు వివాదాన్ని ముగించుకోవడం మంచిదన్న భావన సినీ వర్గీయులు అభిప్రాయ పడుతున్నారు. ఇలాంటి వివాదాలు ఇండస్ట్రీలో సర్వసాధారణమే అయినా, పవన్ కళ్యాణ్ వంటి హీరో సినిమాకు కూడా డిస్ట్రిబ్యూటర్లు ఇలా బహిరంగమవ్వడం అభిమానులకు ఆందోళన కలిగించే అంశం. మరి ఈ వివాదంలో పవన్ తల దూరుస్తారో లేదో చూడాలి.
Photos: Trisha Turns Heads In Saree At CM Event
Indian travellers flying through Europe have received major relief after France removed a visa rule…