
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి సరిగ్గా నేటికి 22 సంవత్సరాలు పూర్తయింది. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలను తెరాస భవన్ లో ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.
టిఆర్ఎస్ నుండి బిఆర్ఎస్ గా మారిన తరువాత జరుగుతున్న తొలి సమావేశం కావడం విశేషం. ఈ ఆవిర్భావ వేడుకలకు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, జెడ్పి చైర్మన్ లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులతో పాటు మరికొంతమంది ముఖ్యనేతలు పాల్గొన్నారు.
సభ ప్రారంభం నుండి కేసిఆర్ ప్రధానంగా రానున్న ఎన్నికల అంశం పైనే చర్చ ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో అవలంభించాల్సిన తీరు, నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ప్రతిపక్ష పార్టీల విమర్శలకు ధీటుగా కౌంటర్లు ఇచ్చే అంశంపై సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులు, విద్యార్థులు మరియు యువత పట్ల వ్యవహరించాల్సిన తీరుపై కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ సమావేశం సాయంత్రం వరకు కొనసాగనుంది.
When Nagarjuna tweeted about Lenin, one line stood out: “Mark the date!”!!” It didn’t feel…
There’s a certain expectation that comes when a project is positioned as an extension of…