
అలాంటి అభిమానుల్లో ఓ వీరాభిమాని మద్యం మత్తులో రెచ్చిపోయాడు. తానూ ఏం చేస్తోన్నది తెలియక, బ్లేడుతో గొంతు కోసేసుకుని రచ్చ రచ్చ చేశాడు. విశాఖపట్నం, రామా టాకీస్ వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సదరు అభిమాని మెడకు గాయం కాగా, మెడ నుండి రక్తం కారుతూ ధియేటర్ ప్రాంగణంలో అలాగే తిరిగాడు. థియేటర్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నం చేసినప్పటికీ, చికిత్స చేయించుకునేందుకు వెళ్లేది లేదంటూ తేల్చిచెప్పాడు.
‘ఖైదీ నంబర్ 150’ టికెట్ ఇస్తే తప్ప ఎవరి మాట విననని మూర్ఖంగా ప్రవర్తించిన అతను, టికెట్ ఇవ్వకుంటే చచ్చిపోతానని స్థానికంగా కాసేపు హడలెత్తించాడు. అయితే చివరికి పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో ధియేటర్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఒకప్పుడు టికెట్ల కోసం లైన్లో నిల్చుని, తోపులాడుకుని ప్రాణాలు విడిచేవారు. బహుశా ట్రెండ్ మారినట్లుగా కనపడుతోంది. ప్రస్తుతం అభిమానులే ‘సూసైడ్’ దిశగా అడుగులు వేయడం శోచనీయమైన విషయం.
Ram Charan’s upcoming film Peddi, directed by Buchi Babu Sana, is generating strong buzz not…
The Tamil Nadu Legislative Assembly witnessed a high-voltage moment today as the Leader of the…