
తొలి సినిమా ‘మిర్చి’కి గానూ 50 లక్షల రూపాయలను పారితోషికంగా అందుకున్న కొరటాల, రెండవ సినిమా ‘శ్రీమంతుడు’కు అంతకు ఎనిమిదింతలు 4 కోట్ల రూపాయలను తీసుకున్నట్లుగా సినీవర్గాలు చెప్పుకుంటుంటాయి. దీనికి తోడు ప్రిన్స్ మహేష్ అందించిన ఓ లగ్జరీ కారు బోనస్. కేవలం రెండు సినిమాలతోనే ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న ఈ రచయిత కం దర్శకుడు మూడవ సినిమాకు ఏకంగా రెండెంకల రెమ్యూనరేషన్ ను టచ్ చేయబోతున్నాడని తెలుస్తోంది.
‘శ్రీమంతుడు’ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్సే ‘జనతా గ్యారేజ్’ కూడా నిర్మాతలు. ‘శ్రీమంతుడు’ సినిమా సక్సెస్ ను చవిచూసిన నిర్మాతలు ముందుగా 8 కోట్ల రూపాయలను ఆఫర్ చేసారట. అయితే స్క్రిప్ట్ వర్క్ మరియు సినిమా విషయంలో కొరటాల చూపుతున్న చొరవను చూసి మరో 2 జతచేసి, ఏకంగా 10 కోట్ల మార్క్ ను అందుకోనున్నారని టాక్. ఇదే నిజమైతే కేవలం మూడవ సినిమాతోనే ఈ స్థాయి రెమ్యూనరేషన్ ను అందుకున్న తొలి దర్శకుడిగా రికార్డులకేక్కుతాడు. ఎన్ని సినిమాలు చేసామన్నది కాకుండా… ఎన్ని క్వాలిటీ సినిమాలు చేసామన్నదే ప్రామాణికంగా కొరటాల ముందుకెళ్తున్నారని ఫిలిం నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…
అవును! నిజమే! జగన్ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…