
ఇదంతా మహేంద్ర సింగ్ ధోనిని వెన్నాడుతోన్న ఓటమి భయం. ఒక్క జింబాబ్వే మినహా అన్ని జట్లపై వరుసగా ఓటములు చవిచుస్తూ విమర్శలను ఎదుర్కొంటున్న ధోనికి నేడు విశాఖలో జరగనున్న ఆఖరి వన్డే కీలకం కానుంది. సిరీస్ లో 2-2తో సమ ఉజ్జీలుగా ఉన్న ఇరుజట్లు… ఆఖరి పోరాటం కోసం సన్నద్ధమవుతున్నాయి. కోహ్లి నాయకత్వంలో టెస్ట్ సిరీస్ ను ‘క్లీన్ స్వీప్’తో ఓటమి పాలు కావడంతో, ధోని సారధ్యంలోని వన్డే సిరీస్ ను ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తున్న కివీస్ జట్టు, ఫుల్ కాన్ఫిడెన్సుతో బరిలోకి దిగుతోంది.
ఒకవేళ ధోని నేడు కూడా టీమిండియాకు కప్ ను అందించడంలో విఫలమైతే, కెప్టెన్సీపై అది తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. టెస్టుల్లో విశేషంగా రాణిస్తూ, ప్రత్యర్ధులను క్లీన్ స్వీప్ చేస్తున్న విరాట్ కోహ్లి చేతికే వన్డే, టీ 20 పగ్గాలు వెళ్ళే అవకాశం ఉంది. బహుశా ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనియే ఒక సంచలన విషయం ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో విశాఖ వేదిక ఎలాంటి సంచలనాలకు వేడుక అవుతుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Andhra Pradesh chief minister, Chandrababu Naidu is one of the senior most leaders in Indian…
US student visas are continuing to witness a downward trend during the spring semester, raising…