
కొన్ని చోట్ల కొంత మంది ఆసుపత్రులలో చేరారు. అయితే ఆ సంఖ్య ఎక్కువేమీ కాదు. ఇన్ని రోజులు మద్యం తాగకుండా తమను తాము నిగ్రహించుకోగలమని మందుబాబులు నిరూపించారు. అయితే ప్రభుత్వాలు మాత్రం ఈ విషయంలో ఓడిపోయాయి. మీరు తాగకుండా ఉండగలరేమో గానీ మీరు తాగకపోతే మేము ఉండలేము అని స్పష్టం చేసేశాయి.
దేశవ్యాప్తంగా వైన్ షాపులు తెరుచుకున్నాయి. దేశంలోనే అత్యధిక కేసులు ఉన్న మహారాష్ట్ర కూడా షాపులను తెరిచేసింది. కిలోమీటర్ల మేర లైన్లలో మందుబాబులు తమను తాము మర్చిపోయి.. కరోనాని కూడా లెక్క చెయ్యకుండా తమ పెగ్గు కోసం ఎగబడ్డారు. అందులో ఎంతమంది తమ ఇళ్లకు క్వార్టర్ తో పాటు కరోనాని కూడా తీసుకుని వెళ్లారో తెలీదు.
ప్రజల ఆరోగ్యమే ముఖ్యం అంటూ లెక్చర్లు ఇచ్చిన కేసీఆర్ వంటి వారు కూడా చేతులు ఎత్తేసి మద్యం షాపులు షూటర్లు తీశారు. దీనితో మద్యం మహమ్మారి పై ప్రజలు గెలిచినా, ప్రభుత్వాలు ఓడిపోయాయి. ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజలను కూడా ముంచకపోతే చాలు అనుకోవాలి అంతే.
నిధులు లేకపోతే ఓట్ల వేటలో వెనుకబడిపోతాం అని షాపులు తెరిచినా.. ఒక చేతి తో ఇచ్చి ఇంకో చేతితో మద్యం పేరుతో లాగేసుకుంటున్నారు అని నిషాలోకి జారిపోయిన ఆ ప్రబుద్దుడికి తెలీదు. ఇందులో మనం చేసేది ఏముంది? ప్రజాస్వామ్యం వర్ధిలాలి… అని ముందుకు వెళ్లిపోవడమే.
Union Minister and Karimnagar MP Bandi Sanjay’s son Bandi Bhageerath had been in the news…
The trailer for Dharma Productions' upcoming film Chand Mera Dil has been dropped and it…