
ధనుష్ తమ కొడుకేనంటూ తొలుత పుట్టుమచ్చలను సాక్ష్యంగా చూపుతూ ట్విస్ట్ ఇచ్చారు. ఈ క్రమంలో ధనుష్ ఒంటిపై పుట్టుమచ్చలను లేజర్ చికిత్స ద్వారా చెరిపివేశారని, ఇందుకు కొన్ని ఆధారాలను ప్రభుత్వ వైద్యులు కోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే. అలాగే ధనుష్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో అతని సంతకం నకిలీదని పేర్కొంటూ కదిరేశన్ దంపతులు తాజాగా కేసు వేశారు.
అంతే కాకుండా అతని సంతకం నకలును తమకు అందజేయాలని వారు కోర్టును కోరారు. దీంతో ధనుష్ షాక్ తిన్నట్టే కనపడుతోంది. ఇప్పటికే పుట్టుమచ్చలకు సంబంధించిన కేసు ఏప్రిల్ 11న విచారణకు రానుండగా, ఇది కూడా అతనిని ఇబ్బంది పెట్టేదేనని కదిరేశన్ దంపతుల న్యాయవాది చెబుతున్నారు. కాలం కలిసి రాకపోతే చీమ కాటుకు కూడా ప్రాణహాని తప్పదంటే ఇదేనేమో అన్నట్లుంది ధనుష్ పరిస్థితి!
Kayadu Lohar has explained why she wrote “I look like a potato” after sharing her…
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…