
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నామని పివిపి సంస్థ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుండి ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించి ఇతర విషయాలేవీ తెలియరాలేదు. మరో పక్కన ప్రిన్స్ కమిట్మెంట్స్ పెరిగిపోతూ ఉండడంతో, ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలుస్తుందో లేదోనన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ పై నిర్మాత పివిపి ఓ అధికారిక ప్రకటన చేసారు. “కాష్మోరా” పబ్లిసిటీలో ఉన్న పివిపిని మీడియా వర్గాలు మహేష్ తో సినిమా గురించి ప్రశ్నించగా, ‘వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2017వ సంవత్సరంలో ఈ సినిమా ప్రారంభమవుతుందని’ స్పష్టత ఇచ్చారు. అంతేకాదు, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని కూడా తెలియజేయడంతో, మురుగదాస్ తర్వాత ప్రిన్స్ నటించే మరో సినిమా రెండు భాషల్లో తెరకెక్కనుందని ఖరారయ్యింది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…