
అయితే, ఈ యాడ్ కు 10 లక్షలకు పైగా లైక్ లు వచ్చినట్టు సంస్థ ఫేస్ బుక్ పేజీలో తెలుస్తోంది. అలాగే మరెంతో మంది ఈ చర్యను తప్పుబడుతున్నారు. దీనిపై మలబార్ గోల్డ్ మార్కెటింగ్ డైరెక్టర్ అమ్జాద్ హుస్సేన్ స్పందిస్తూ, “మాది అంతర్జాతీయ సంస్థ. గల్ఫ్ దేశాల్లోనూ శాఖలున్నాయి. వ్యాపార విస్తరణలో భాగంగా ప్రకటనలను తయారు చేసే బాధ్యత ఇంటర్నేషనల్ ఏజన్సీకి అప్పగించాం. మార్కెటింగ్ వ్యూహంలో భాగంగానే ఓ వర్గం కస్టమర్ల కోసం దాన్ని తయారు చేశాము” అన్నారు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, “గల్ఫ్ మార్కెట్ నే దృష్టిలో ఉంచుకుంటే, అక్కడెంతో మంది మళయాళీలు, భారతీయులు ఉన్నారు. వారినెందుకు ప్రస్తావించలేదు. ఇండియాలోని ఓ పెద్ద సంస్థగా, దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులనూ, ప్రజల సెంటిమెంట్ నూ గుర్తెరగాలి. ఓ భారత సంస్థగా ఈ పని చేసుండకూడదు” అని మైత్రీ ఎడ్వర్టయిజింగ్ డైరెక్టర్ రాజు మీనన్ వ్యాఖ్యానించారు.
The motion poster of Chandrayan has been unveiled, giving audiences a glimpse into a wildly…
Chennai Super Kings have been asked to consider a change in captaincy before IPL 2027,…