
అయినా లేని వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేస్తే నాగేశ్వరరావుకు ఏమోస్తుందనేగా మీ డౌటు. ఇక్కడ డౌటు పడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే, దేశీయ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వద్ద కాంట్రాక్టు దక్కించుకునేందుకు రంగంలోకి దిగిన బడా కాంట్రాక్టర్లకు కొమ్ము కాసేందుకు సిద్ధపడ్డ ఆయన భారీ ఎత్తున ముడుపులు అందుకుని ‘మాయ దందా’కు తెర లేపినట్లు రవాణా శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. దీనిపై విచారణ కూడా మొదలైంది. ఈ విచారణలో ఇంకా ఏమేం మాయలు వెలుగుచూస్తాయో చూడాలి.
ఈ సంఘటనపై ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ఫైరయ్యారు. ఉనికిలోనే లేని 27 వాహనాలకు ఎంవీఐ నాగేశ్వరరావు రిజిస్ట్రేషన్ చేసిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనువెంటనే రవాణా శాఖ ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనే తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ తరహా మోసాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ వారం తెలుగు, ఇతర భాషలు కలిపి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సంఖ్య బాగానే ఉన్నా, ఒక్క…
Rohit Sharma is making his television debut with Sony TV’s new show Family Full House…