
ఓ పక్కన కాపులకు ఇటీవలే రుణాలు పంపిణీ చేసి సరైన రీతిలో న్యాయం చేస్తున్నా, ఇలాంటి ఆరోపణలు రావడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు, కాపు సామాజిక వర్గానికి చెందిన కేబినెట్ మంత్రులు ముద్రగడపై పోరు సాగించాలని, ఎదురు దాడికి దిగాలని సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రభావం మంత్రి నారాయణ ప్రెస్ మీట్ లో స్పష్టంగా బయట పడింది.
“రెండు రోజుల క్రితం ఏలూరులో కాపు కార్పొరేషన్ ద్వారా 192 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయగా, మిగిలిన అన్ని జిల్లాల్లోను ఇచ్చేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇంతలోనే తొందరపడితే ఎలా? ‘ఈ దరిద్రపు జాతి పూర్తిగా అంతరించిపోవాలన్నదే మీ కోరికగా కన్పిస్తున్నది’ అంటూ లేఖలో రాసిన కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని.., కాపులంటే దరిద్రపు జాతా? కాపుల్లో పేద ప్రజలే కానీ దరిద్రులు మాత్రం కాదు. ఎంత కాలం నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు? పదాలు రాసేటప్పుడు జాగ్రత్తగా వహించావద్దా? మీరు కాపు వర్గానికి చెందిన వారు, నేనూ కాపు వర్గానికి చెందిన వాడినే. ఈ రాష్ట్రంలో కాపులకు ఎవరు ఎటువంటి మేలు చేస్తారో చూద్దాం” అంటూ మంత్రి నారాయణ తీవ్రంగా స్పందించారు.
కాపు ఉద్యమం లేవనెత్తిన సమయం నుండి ముద్రగడపై వేచి చూసే ధోరణితో ఉన్న చంద్రబాబు సర్కార్, ఇక ఎదురుదాడే లక్ష్యంగా దూసుకెళ్ళనుందని మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది. అయితే ఈ లేఖ వెనుక జగన్ ఉన్నాడనే మాటలు సర్వత్రా వినపడుతున్నాయి. కుల రాజకీయాలను ఉపేక్షించవద్దని చంద్రబాబు తన అనుచర వర్గానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన దరిమిలా రాష్ట్రంలో హాట్ హాట్ వాతావరణం నెలకొంది.
For the last few years, Pawan Kalyan had been suffering from multiple physical conditions, including…
తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…