
టాస్ గెలిచిన టీమిండియా ఈ సారి బ్యాటింగ్ ఎంచుకోగా, ఓపెనర్ శిఖర్ ధావన్ 4 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో మరో ఓపెనర్ రోహిత్ శర్మకు జతకలసిన కెప్టెన్ విరాట్ కోహ్లి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. విరాట్ ఔటయ్యే సమయానికి 29.3 ఓవర్లలో 225 పరుగులతో టీమిండియా ఉందంటే, ఆ తర్వాత పతనం ఎలా జరిగిందో ఊహించుకోవచ్చు. ఇక విరాట్ ఉండి ఉంటే… అన్న ఊహలకు అంచనాలు కూడా సరిపోవేమో… అన్నంతగా చెలరేగిపోయాడు. కేవలం 96 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 131 పరుగులు చేసి ఔటయ్యాడు.
మరో ఎండ్ లో ఉన్న రోహిత్ శర్మ ఈ సిరీస్ లో వరుసగా రెండో సెంచరీని నమోదు చేసి దుమ్ముదులిపాడు. కేవలం 88 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు చేసిన రోహిత్ శర్మ నాలుగవ వికెట్ గా వెనుదిరగడంతో స్కోర్ బోర్డు బాగా నెమ్మదించింది. చివర్లో మనీష్ పాండే 42 బంతుల్లో 50 పరుగులు చేయగా, 300వ వన్డే ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోని 42 బంతుల్లో 49 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ నాటౌట్ తో వన్డేలలో అత్యధిక నాటౌట్లుగా నిలిచిన బ్యాట్స్ మెన్ గా ధోని 73 సార్లతో పొల్లాక్ రికార్డును తిరగరాశాడు.
Ravi Teja took the box office by storm in August. Irumudi came without the huge…
Kalki 2898 AD changed the game for Prabhas. After films like Saaho, Radhe Shyam, and…