
అప్పటికి టీమిండియా కేవలం 8 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా, చేతిలో 6 వికెట్లతో 6 ఓవర్లు కూడా ఉన్నాయి. ఈ పరిణామంతో షాక్ తిన్న శ్రీలంక క్రికెటర్లు మైదానంలో నిల్చుని చూస్తుండగా, అప్పటికి క్రీజులో ఉన్న రోహిత్ శర్మ, ధోనిలు కాసేపు ముచ్చటించుకున్న తర్వాత, ధోని పక్కకు జరిగి మైదానంలోనే కాసేపు కునుకు తీసాడు. మైదానంలో ఓ పక్కన అంత రచ్చ జరుగుతుంటే, ఆడియన్స్ కు షాక్ ఇచ్చే విధంగా ధోని గ్రౌండ్ మధ్యలో పడుకుని నిరసన తెలపడం విశేషం. బహుశా ధోని మాత్రమే ఇలా చేయగలరు అనిపించే విధంగా తన మార్క్ ను ప్రదర్శించారు.
అయితే ఆ తర్వాత గ్రౌండ్ ఖాళీ చేయించడం, మళ్ళీ ఆట ప్రారంభం కావడం టీమిండియా విజయం సాధించడం జరిగిపోయాయి. దీంతో అయిదు వన్డేల సిరీస్ లో మరో రెండు వన్డేలు మిగిలి ఉండగానే 3-0తో టీమిండియా దక్కించుకుంది. 218 పరుగుల లక్ష్యచేధనలో 61 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా విజయసాధనలో ఓపెనర్ రోహిత్ శర్మ (124), మహేంద్ర సింగ్ ధోని (67) పరుగులతో సత్తా చాటి విజయతీరాలకు చేర్చారు. బౌలింగ్ లో విశేషంగా రాణించి 27 పరుగులకే 5 వికెట్లు తీసిన బూమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Ravi Teja took the box office by storm in August. Irumudi came without the huge…
Kalki 2898 AD changed the game for Prabhas. After films like Saaho, Radhe Shyam, and…