
‘మహానుభావుడు’ సినిమాను నిజానికి అక్కినేని అఖిల్ తో తీయాల్సి ఉందని, కానీ డేట్స్ కుదరకపోవడంతో శర్వానంద్ తో తీసానని తెలిపిన మారుతీ, తన తదుపరి చిత్రాన్ని అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కించ బోతున్నానని తెలిపారు. ప్రేమ, వినోదం కలగలిపిన కధతో ఈ సినిమా తెరకెక్కనుందని స్పష్టత ఇచ్చిన వార్త, అక్కినేని ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీలో ముంచెత్తింది.
ప్రస్తుతం చైతూకు కూడా ఖచ్చితంగా ఓ హిట్ కావాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్న “యుద్ధం శరణం” దారుణ పరాజయం పొందడంతో, ప్రస్తుతం “సవ్యసాచి”పై దృష్టి పెట్టాడు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తర్వాత మారుతీ – చైతూ జోడి తెరపైకి రానుందన్న మాట. మరి చైతూకు కూడా ఓ ‘భలే భలే మగాడివోయ్’ గానీ, మరో ‘మహానుభావుడు’ గానీ ఇస్తారేమో చూడాలి.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…