
ఒకప్పటి మిస్ ఇండియాగా వెలుగొందిన నమ్రత, హిందీ, తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. పెళ్లి తర్వాత సిల్వర్ స్క్రీన్ కు విడాకులు ఇచ్చేసిన ప్రిన్స్ సతీమణి, మళ్ళీ ఓ భారీ సినిమాలో నటిస్తోందన్న ప్రచారం ఇటీవల కాలంలో భారీ స్థాయిలో జరిగింది. కానీ, ఇదంతా కేవలం ఒక రూమర్ మాత్రమేనని, ఇలాంటి సిల్లీ పుకార్లను నమ్మవద్దని స్వయంగా నమ్రత చెప్పడంతో, ప్రిన్స్ సతీమణిగా రీ ఎంట్రీకి ఆస్కారం లేదన్న విషయం స్పష్టమైంది.
ప్రస్తుతం ఒక తల్లిగా పిల్లలను చూసుకుంటూ, ప్రిన్స్ సతీమణిగా మహేష్ బ్రాండ్ ప్రమోషన్స్ ను, మార్కెటింగ్ వ్యవహారాలను చూసుకుంటూ నిత్యం బిజీగా గడుపుతున్నానని, ప్రస్తుతానికి ఇదే తన జీవితమని, మళ్ళీ నటించే అవకాశం లేదని తేల్చిచెప్పింది. ఒక తల్లిగా అనుభవిస్తున్న మాధుర్యం మాటల్లో చెప్పలేనిదని, అది అనుభవిస్తేనే తెలుస్తుందని, నా తల్లితండ్రులు చూపించిన ప్రేమను నాడు అర్ధం చేసుకోలేకపోయానని, ఇప్పుడు అది తనకు తెలిసి వస్తోందని, గౌతమ్, సితారలను మానవతా విలువలతో పెంచడమే తన లక్ష్యంగా చెప్పుకొచ్చింది.
తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు మూడు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనతో రాష్ట్ర…
Prime Minister Modi’s relentless energy is the ultimate case study in discipline. Just days ago,…